మంత్రి సమక్షంలో ఇజ్రాయిల్ పేట ఆర్చి వివాదానికి తెర

by Disha Web Desk 16 |
మంత్రి సమక్షంలో ఇజ్రాయిల్ పేట ఆర్చి వివాదానికి తెర
X

దిశ, ఎర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం ఇజ్రాయిల్ పేట ముఖద్వారా నిర్మాణం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. గత ఆదివారం అర్ధరాత్రి ఇరువర్గాలు రాళ్ల దాడి చేసుకున్నాయి. దీంతో కొందరికి గాయాలయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం ఎర్రగొండపాలెం వీధులలో సహారా కాశారు. అనంతరం ఎమ్మార్వో రవీందర్ 144 సెక్షన్ అమలు చేసి పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బెటాలియన్‌తో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం మంత్రి ఆదిమూలపు సురేష్ సమక్షంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇరుపక్షాలు రాజీ కుదుర్చుకున్నాయి. ఇక ఎప్పటికీ అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఒప్పందం చేసుకున్నారు. దీంతో ఈ సమస్య సమసిపోయింది.



Next Story

Most Viewed