Breaking: ఉద్రిక్త పరిస్థితుల్లో చంద్రబాబు కీలక ప్రకటన.. దమ్ముంటే గెలవాలని మంత్రికి సవాల్

by Disha Web Desk 16 |
Breaking: ఉద్రిక్త పరిస్థితుల్లో చంద్రబాబు కీలక ప్రకటన.. దమ్ముంటే గెలవాలని మంత్రికి సవాల్
X

దిశ,వెబ్ డెస్క్: ఎర్రగొండపాలెం చంద్రబాబు పర్యటనలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దళితులకు క్షమాపణలు చెప్పి చంద్రబాబు ఎర్రగొండపాలెంలో పర్యటించాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ డిమాండ్ చేశారు. డిమాండ్ చేసినట్లుగానే చంద్రబాబు పర్యనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ క్యాంపు కార్యాలయం వద్దకు చంద్రబాబు కాన్వాయ్ చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు గోబ్యాక్ అంటూ మంత్రి ఆదిమూలపు సురేశ్‌తోపాటు వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు మంత్రి కార్యాలయం ముందు ఆగి వైసీపీ కార్యకర్తలను హెచ్చరించారు. అంతేకాదు టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మంత్రి ఆఫీసుపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

దీంతో మంత్రి ఆదిమూలపు సురేశ్‌పై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్యే ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థిగా ఎరిక్స‌న్ బాబును ప్రకటించారు. దమ్ముంటే ఎరిక్స‌న్ బాబుపై పోటీ చేసి గెలవాలని మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు సవాల్ విసిరారు. మూలాలు లేని వ్యక్తి మంత్రి ఆదిమూలపు సురేశ్ అని చంద్రబాబు మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి:

Ap News: కంచుకోటపై టీడీపీ ఫోకస్...పోటీ చేసేది ఎవరో...?


Breaking: మంత్రి ఆదిమూలపు సురేశ్ నిరసన... ఉద్రిక్తత..!



Next Story

Most Viewed