అమ్మో మడకశిర స్టేషనా..? భయపడుతున్న పోలీసులు

by Disha Web Desk 7 |
అమ్మో మడకశిర స్టేషనా..? భయపడుతున్న పోలీసులు
X

దిశ, మడకశిర: స్థానిక పోలీస్ స్టేషన్‌కు పోలీసు అధికారులు రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే మడకశిరకు వచ్చిన ఏ పోలీసు అధికారైనా ఏదో ఒక వివాదంలో చిక్కుకుని వీఆర్‌కు వెళ్తున్నారు. అవినీతి ఆరోపణలుగానీ, రాజకీయ నాయకుల ఒత్తిళ్లుగానీ పోలీసు అధికారుల బదిలీకి కారణమవుతున్నాయి. కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో ఇక్కడ జూదం, మట్కా కట్టడి చేయాలంటే కత్తి మీద సాములా మారింది.

మరో వైపు పలువురు అధికారులు ఇక్కడి గ్రానైట్ క్వారీల యజమానులతో కుమ్మక్కై సొమ్ము చేసుకున్నారని, మరి కొందరు జూదాలను ఆడించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఆరోపణ కారణంగానే ముగ్గురు సీఐలు, ముగ్గురు ఎస్సైలు వీఆర్‌కు వెళ్లారు. 2019 నుంచి ఇప్పటి వరకు సీఐలు దేవానంద్, రాజేంద్రప్రసాద్, నాగరాజురావు, శ్రీరామ్, ఎస్సైలు శరత్ చంద్ర, శేషగిరి, నాగేంద్ర వివిధ ఆరోపణలతో బదిలీ వేటుకు గురయ్యారు. వీరందరికీ పోలీసు ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపడం గమనార్హం.

Next Story