దేవుడి భూమి... రైతు చేసిన పనికి షాక్‌కు గురైన పోలీసులు

by Vemula.Srinu Prasad |

కర్నూలులో రైతు చేసిన పనికి పోలీసులు సైతం బిత్తరపోయారు...

దేవుడి భూమి... రైతు చేసిన పనికి షాక్‌కు గురైన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు(Kurnool)లో రైతు శివయ్య(Former Sivaiah) చేసిన పనికి పోలీసులు సైతం బిత్తరపోయారు. దేవుడి ఇనాము భూమి(Temple Land)ని కౌలుకు తీసుకున్నారు. మిరప, కంది పంట సాగు చేశారు. ఇక్కడే శివయ్య బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ పంటల మాటున గంజాయి(Ganja)ని కూడా సాగు చేశారు. మొక్కలు ఏ మాత్రం అనుమానం రాకుండా మిగిలన వాటిలో కలిసిపోయాయి. అయితే ఈ సాగును ఎవరో గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఘటనా స్థలానికి వెళ్లి పోలీసులు బిత్తరపోయారు. ఏ మాత్రం అనుమానం రాకుండా మిరప, కంది పంటల మాటున గంజాయి సాగు చేయడం, మొక్కలు ఏపుగా పెరిగి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. 300 మొక్కలు, 5 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైతు శివయ్య పరారీకావడంతో గాలిస్తున్నారు. త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

Next Story