వైసీపీ నేతల ఇళ్లపై దాడులు.. పేర్ని నాని ఇంటివద్ద భారీ బందోబస్త్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-01 16:09:44  IST  )

అధికార ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహ జ్వాలలు రగిలించాయి.

వైసీపీ నేతల ఇళ్లపై దాడులు.. పేర్ని నాని ఇంటివద్ద భారీ బందోబస్త్
X

దిశ, వెబ్‌డెస్క్: అధికార ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహ జ్వాలలు రగిలించాయి. ఫలితంగా మాజీ మంత్రులైన అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేసి నిప్పంటించారు. ఈ ఘటనలను వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. పేర్ని నాని నివాసంపై దాడి జరిగే అవకాశం ఉండటంతో.. ఆయన ఇంటికెళ్లే పలు మార్గాల్లో పోలీసులు పికెటింగ్ నిర్వహిస్తున్నారు. రామానాయుడుపేట, బచ్చుపేట, హిందూ కాలేజీ, రైల్వే స్టేషన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పోలీసులు అనుమానుతుల్ని తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు వైసీపీ శ్రేణులు భారీగా పేర్నినాని ఇంటికి చేరుకుంటున్నారు.

Next Story