- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీటెక్ రవిని పోలీసులే చంపేందుకు ప్లాన్..కేంద్రానికి ఫిర్యాదు చేస్తా: సీఎం రమేశ్
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై బీజేపీ నేత సీఎం రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవిని అరెస్టు చేసిన విధానంపై మండిపడ్డారు. ఈ అంశంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని సీఎం రమేశ్ హెచ్చరించారు. కడప సెంట్రల్ జైల్లో మంగళవారం బీటెక్ రవిని సీఎం రమేశ్ కలిసి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 14న బీటెక్ రవిని కిడ్నాప్ చేసి పోలీసులు చంపేయాలకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. యువగళం పాదయాత్ర కేసును సాకుగా చూపించి కడప నగర శివార్లలో వాహనంలో నుంచి దింపి పోలీసు వాహనంలో మూడు గంటల పాటు తిప్పారు అని ఆరోపించారు. ఆ తర్వాత పాడుబడ్డ భవనంలోకి తీసుకెళ్లి నిజం చెప్పకపోతే చంపేస్తామని బీటెక్ రవిని బెదిరించారన్నారు. బతికి ఉంటే కదా నువ్వు పులివెందులలో పోటీ చేసేది. పులివెందులలో అంత పెద్ద ఆఫీస్ ఎందుకు పెట్టావు?, సునీతమ్మ, లూథ్రాలు ఏమైనా చేస్తామని చెప్పారా? అంటూ బీటెక్ రవిని పోలీసులు పదేపదే బెదిరించారని సీఎం రమేశ్ ఆరోపించారు.