కారు డోర్ తీయగానే ఘాటు వాసన.. పోలీసుల తనిఖీల్లో షాకింగ్ పదార్థం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-15 08:50:27  IST  )

కారులో గంజాయిని రాష్ట్రాన్ని దాటిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కోటి విలువైన గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు...

కారు డోర్ తీయగానే ఘాటు వాసన.. పోలీసుల తనిఖీల్లో షాకింగ్ పదార్థం
X

దిశ, వెబ్ డెస్క్: కారు(Car)లో గంజాయి(Ganjai)ని రాష్ట్రాన్ని దాటిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కోటి విలువైన గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం మత్స్యపురం(Mastyapuram) వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారులో నుంచి ఘాటు వాసన వస్తుండటంతో సోదాలు చేశారు. దాదాపు 200 కేజీల గంజాయిని గుర్తించారు. ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ‘‘గంజాయి తరలింపు వెనుక ఎవరున్నారు..?, ఎక్కడ నుంచి తరలిస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు.?. అసలు ఈ వ్యవహారంలో ఎంత మంది ప్రమేయం ఉంది’’ అనే కోణంలో ఆరా తీస్తున్నారు. గంజాయి సాగు చేయడం, అమ్మడం చట్టరీత్యా నేరమని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరంచారు.

Next Story