స్టీల్‌ప్లాంట్ ప్రమాదంపై మోడీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

by Naga Rani Yarlagadda |

స్టీల్‌ప్లాంట్ ప్రమాదంపై మోడీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ప్రమాద ఘటనలో మరణించిన 9 మంది కుటుంబాలకు తన సానుభాతిని ప్రకటించారు. వారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. స్టీల్ ప్లాంట్ లో ఉక్కు ద్రవం పడి సజీవ సమాధి అయిన 9 మంది కుటుంబాలకు ప్రధాని ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నవారికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story