ఈనెల 19న పీఎం కిసాన్ నిధులు

by Muthe.Rajitha |

రైతులకు పంట సహాయం నేపథ్యంలో వారికి పిఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఈనెల 19న పీఎం కిసాన్ నిధులు
X

దిశ, వెబ్ డెస్క్: రైతులకు పంట సహాయం నేపథ్యంలో వారికి పిఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిధులను ఏడాదికి మూడు విడతల్లో వారి ఖాతాల్లో జమ చేస్తోంది. కాగా ఈ ఏడాదికి సంబంధించిన చివరి విడత నిధులు ఈనెల 19న తేదీన విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ విడతలో అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున నిధులు జమ చేయనున్నారు.

ఇక ఏపీ ప్రభుత్వం కూడా రైతులకు ఏడాదికి 20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తుండగా.. అందులో రెండవ విడత నిధులు కూడా ఈనెల 19న విడుదల చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం అవుతున్నాయి. పీఎం కిసాన్ నిధులతో కలిపే అన్నదాత సుఖీభవ నిధులు కూడా రైతుల అకౌంట్లలో జమ చేస్తామని ఇదివరకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Next Story