- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ATM's Closed rumors: ఏటీఎంలు మూసివేస్తున్నారంటూ వదంతులు.. వాటిని నమ్మవద్దన్న పీఐబీ ఫ్యాక్ట్చెక్
భారత్ పాకిస్తాన్మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో రెండు మూడు రోజుల పాటు ఏటీఎంలు మూసివేస్తారంటూ ఓ వార్త సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో : భారత్ పాకిస్తాన్మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో రెండు మూడు రోజుల పాటు ఏటీఎంలు మూసివేస్తారంటూ ఓ వార్త సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాకిస్తాన్మనపై సైబర్దాడికి సిద్ధం అవుతోందని దీంతో ఏటీఎంలు మూసివేస్తారని దీని సారాంభం. ఈ వందంతుల నమ్మవద్దంటూ పీఐబీ (ప్రెస్ఇన్ఫర్మేషన్బ్యూరో) PBI Fact Check ఫ్యాక్ట్చెక్తన ట్విట్టర్ఖాతాలో పోస్టు చేసింది. ఈ రోజు ఎటువంటి నగదు ట్రాన్సాక్షన్స్చేయవద్దంటూ వైరల్ అవుతున్న ఆ వాట్సప్పోస్టులో పేర్కొన్నారు. మొత్తం 74 దేశాల్లో ఇటువంటి సైబర్ఎటాక్లు జరుగుతాయంటూ ఫేక్ప్రచారాన్ని చేశారు. ఈ వార్తలను పీఐబీ పూర్తిగా ఖండించింది. ఇది ఫేక్మెసేజ్ అని .. ఎవరూ దీనిని నమ్మవద్దంటూ పేర్కొంది. ఏటీఎంలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపింది. ఇటువంటి ప్రచారాలను ఎవరూ సోషల్మీడియాలో షేర్చేయవద్దని సూచించింది.
https://x.com/PIBFactCheck/status/1920698826559512595?t=PYVkyCgvTt7cMoS9j53i2w&s=19






