నెల్లూరులో పీజీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. సారీ చెబుతూ లేఖ

by Vemula.Srinu Prasad |

నెల్లూరులో పీజీ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేగింది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో పీజీ సెకండియర్‌ చదువుతున్న తేజస్విని గురువారం రాత్రి నిద్రమాత్రలు మింగారు....

నెల్లూరులో పీజీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. సారీ చెబుతూ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు(Nellore)లో పీజీ విద్యార్థిని తేజస్విని(PG Student) ఆత్మహత్యాయత్నం(Suicide Attempt) చేసుకోవడం కలకలం రేగింది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో పీజీ సెకండియర్‌ చదువుతున్న తేజస్విని గురువారం రాత్రి నిద్రమాత్రలు మింగారు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఉదయం గమనించిన తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్న ట్లు తెలుస్తోంది.

ప్రేమ వ్యవహారమే కారణం

అయితే తేజస్విని ఆత్మహత్యాయత్నానికి కారణం ప్రేమ వ్యవహారమని కాలేజ్ ప్రిన్సిపల్ రాజేశ్వరి తెలిపారు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటంతో విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిందని ఆమె చెప్పారు. కుటుంబ సభ్యులకు సారీ చెబుతూ సూసైడ్ లేఖ కూడా రాసిందని తెలిపారు. గుంటూరులో ఉన్న తేజస్విని తల్లిదండ్రులకు తాము సమాచారం అందించామని ప్రిన్సిపల్ రాజేశ్వరి పేర్కొన్నారు.

Next Story