బాలయ్య అన్ స్టాపబుల్ షోపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..

by Disha Web Desk 19 |
బాలయ్య అన్ స్టాపబుల్ షోపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహారిస్తున్న అన్ స్టాపబుల్ షోకు జనసేన అధినేత, స్టార్ హీరో పవన్ కల్యాణ్ గెస్ట్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఎపిసోడ్‌పై వైసీపీ కీలక నేత, మాజీమంత్రి పేర్నినాని సెటైర్లు వేశారు. బావ చంద్రబాబు తప్పుల్ని సరిచేయడానికి.. బావ పార్టనర్‌తో మాట్లాడటానికి బాలకృష్ణ ఈ షోను వాడుకుంటున్నారని అన్నారు. గతంలో చంద్రబాబుతో ఇంటర్వ్యూ చేసి.. ఎన్టీఆర్‌ను కూలదోసిన కుట్రను మసిపూసి మారేడు కాయ చేశారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ బావ, బావమరిదితో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. వారిద్దరిదీ షో మాత్రమేనని.. అంతకుమించి ఏమి ఉండదని అన్నారు. బావతో కలిసి తిరిగిన పవన్ కల్యాణ్.. బావమరిదితో కలిసే తిరుగుతే తప్పేమి లేదన్నారు.

ఇదిలా ఉండగా.. బాలయ్య, పవన కల్యాణ్‌ల అన్ స్టాపబుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కాకముందే ప్రకంపనలు రేపుతోంది. వైసీపీ నేతల అప్పడే ఈ ఎపిసోడ్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక, ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రోమోలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. ఈ ఎపిసోడ్‌లో పవన్ కల్యాణ్, బాలయ్యల మధ్య రాజకీయాలు ప్రస్తావనకు వచ్చాయి. బాలయ్య పవన్ కల్యాణ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. టీడీపీతో పొత్తు.. ఏపీలో మళ్లీ 2014 సీన్ ఎందుకు రిపీట్ కాకుడదని బాలయ్య ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వెనుక అంత్యరమేంటని.. ఇలా బాలయ్య పలు ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు. బాలయ్య, పవన్‌ల మధ్య కీలక రాజకీయ అంశాలు ప్రస్థావనకు రావడంతో ఈ ఎపిసోడ్‌పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

READ MORE

రష్మిక ఫేస్ హిందీ ఇండస్ట్రీకి పనికిరాదు.. పరువు తీసిన బాలీవుడ్ నటుడు


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed