స్పీడందుకున్న పెన్షన్ల పంపిణీ.. 61.36 లక్షల మందికి అందజేత

by Disha Web Desk 16 |
స్పీడందుకున్న పెన్షన్ల పంపిణీ.. 61.36 లక్షల మందికి అందజేత
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. నిన్న 25 లక్షలకు మందికి పైగా పింఛన్లు అందించారు. శుక్రవారం ఉదయం నుంచే పెన్షన్లు అందిస్తున్నారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల అందించొద్దన్న ఎన్నికల సంఘం ఆదేశాల్లో గ్రామ, వార్డు సచివాలయాల వద్ద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, డయాలసిస్ రోగులను పింఛన్లు అందిస్తున్నారు. ఇప్పటివరకూ 61 లక్షల 36 వేల మందికి పెన్షన్ల పంపిణీని పూర్తి చేశారు. ఇప్పటివరకు రూ.1,847 కోట్లను లబ్ధిదారులను అందజేశారు. శనివారం కూడా పెన్షన్ల పంపిణీ కొనసాగనున్నాయి. రెండు రోజుల్లో 94 శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. శనివారం పెన్షన్ పంపిణీ పూర్తి అయ్యే అవకాశం ఉంది.

Next Story

Most Viewed