ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పవన్ కల్యాణ్ కీలక సందేశం!

by Disha Web Desk 2 |
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పవన్ కల్యాణ్ కీలక సందేశం!
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ 10వ ఆవిర్భాత దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అధినేత పవన్ కల్యాణ్ కీలక సందేశం పంపించారు. ‘‘రాజకీయాల్లో దశబ్దానికి పైగా అనుభవం సంపాదించుకున్నాను. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని నిలబడ్డాను. రెండుచోట్లా ఓడిపోయినా ఆగిపోలేదు. ప్రజా సమస్యలపై నా వంతు కృషిగా స్పందిస్తున్నాను. తాము అధికారంలో లేకపోయినా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలబడ్డాం. ఈ ఒక్కసారి నన్ను నమ్మండి. నేను నిలబెట్టే అభ్యర్థిలో నన్ను చూసి గెలిపించండి.’’ అని పవన్ కల్యాణ్ కోరారు. తాజాగా.. ఈ వ్యాఖ్యలను ఆవిర్భావం రోజున జనసైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.


Next Story