ప్యాకేజీ కోసం జనసైనికులను తాకట్టు పెట్టేసిన పవన్ కల్యాణ్ : మంత్రి ఆర్‌కే రోజా

by Disha Web Desk 21 |
ప్యాకేజీ కోసం జనసైనికులను తాకట్టు పెట్టేసిన పవన్ కల్యాణ్ : మంత్రి ఆర్‌కే రోజా
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ కోసం జనసేన కార్యకర్తలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాకట్టు పెట్టారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా విమర్శించారు. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచే ఉన్నారని చెప్పుకొచ్చారు. అయితే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు దగ్గర ముసుగు తీసేశారని అన్నారు. తాము మెుదటి నుంచి టీడీపీ, జననసేన ఒక్కటేనని చెప్తున్నామని అది నిజమని పవన్ కల్యాణ్ నిరూపించారని అన్నారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవని పవన్‌ కల్యాణ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని ఏమీ చేయలేరని మంత్రి రోజా అన్నారు. విజయవాడలో శుక్రవారం మంత్రి ఆర్‌కే రోజా మీడియాతో మాట్లాడారు. స్కిల్‌ కుంభకోణంలో పవన్‌ కల్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడు అని ఆరోపించారు. చంద్రబాబుది అక్రమ కేసు కాదు.. అడ్డంగా దొరికిపోయిన కేసు అని అన్నారు. చంద్రబాబు సీట్‌లో బాలకృష్ణ కూర్చున్న 48 గంటల్లోనే పవన్‌ కల్యాణ్‌ను రంగంలోకి దింపారని అన్నారు. చంద్రబాబు తప్పు చేయకపోతే బాబు ఆస్తులపై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేయాలి అని సూచించారు. పవన్‌కు కనీస జ్ఞానం కూడా లేదు అని అన్నారు. 13 చోట్ల చంద్రబాబు సంతకాలు పెట్టి దొరికిపోయిన దొంగ అని రోజా మండిపడ్డారు. స్కిల్‌ కుంభకోణంలో ఐటీ, జీఎస్టీ, ఈడీలు విచారణలు జరిపాయి అని చెప్పుకొచ్చారు. నందమూరి బాలకృష్ణ తన తండ్రి మీద చెప్పులేసిన చంద్రబాబునే ఏమీ చేయలేకపోయాడు. ఇంక సీఎం వైఎస్ జగన్‌ను ఏం చేయగలడు అని నిలదీశారు. నిజంగా స్కిల్‌ కుంభకోణంలో చంద్రబాబుకు తప్పు చేయకపోతే సీబీఐ, ఈడీ విచారణ కోరాల‌ని మంత్రి ఆర్‌కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed