వాళ్లు సకాలంలో స్పందించి ఉంటే రైతు ప్రాణం నిలబడేది: Pawan Kalyan

by GSrikanth |   (  Updated:2022-09-04 10:51:31  IST  )

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ సర్కార్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైతు బలి కావడం దురదృష్టకరం అని ఆవేదన చెందారు.

వాళ్లు సకాలంలో స్పందించి ఉంటే రైతు ప్రాణం నిలబడేది: Pawan Kalyan
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ సర్కార్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైతు బలి కావడం దురదృష్టకరం అని ఆవేదన చెందారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సకాలంలో స్పందించి ఉంటే రైతు ప్రాణం నిలబడేది అని మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టే వైసీపీ ప్రభుత్వానికి.. ఇలాంటి ఘటనలను పట్టించుకునే టైమే లేదని ఎద్దేవా చేశారు. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

కాగా, రెండెకరాల భూమిని రక్షించుకునేందుకు ఐదు దశాబ్దాలుగా పోరాడుతున్న రైతు.. చివరకు ఆ పోరాటంలోనే కన్నుమూశాడు. న్యాయస్థానం ఉత్తర్వుల్ని కూడా లెక్కచేయని అధికారుల అలసత్వాన్ని ప్రశ్నిస్తూ.. తహసీల్దారు కార్యాలయంలోనే తుదిశ్వాస విడిచాడు. చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరులో శనివారం ఈ విషాద ఘటన జరిగింది.

Next Story