మంత్రి గుడివాడ అమర్నాథ్ నోరు అదుపులో పెట్టుకో: పాశర్ల ప్రసాద్

by Disha Web Desk 19 |
మంత్రి గుడివాడ అమర్నాథ్ నోరు అదుపులో పెట్టుకో: పాశర్ల ప్రసాద్
X

దిశ, ఉత్తరాంధ్ర: మంత్రి అమర్నాథ్ నోరు అదుపులో పెట్టు కోవాలని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ హెచ్చ రించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాసర్ల మాట్లాడుతూ.. జిల్లాకి ఇటీవల వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటనపై మంత్రి అమరనాథ్ ఆవాకులు చావాకులు పేలారని విమర్శించారు.

మంత్రి గుడివాడ అమర్నాథ్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. పక్క రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ తాను చేస్తున్న అభివృద్ధి చూస్తే.. ఏపీ ఐటి మంత్రి గుడివాడ ఏం చేస్తున్నాడో అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గుడివాడ కుటుంబాన్ని రోడ్ మీద వదిలేస్తే.. చంద్రబాబు ఆదరించి టిక్కెట్ ఇచ్చిన విషయం మర్చిపోయారని అన్నారు.

చంద్రబాబుకు ఎక్సపైర్ డేట్ వచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేసిన అమర్నాథ్‌కు నాయకత్వ లక్షణాలు లేవనన్నారు. టిడ్కో ఇల్లు ఇచ్చింది చంద్రబాబు అని తెలుసు కోవాలన్నారు. 48 గజాల్లో ఇల్లు అవుతుందా అని ప్రశ్నించారు. వాగులు వంకలు ప్రవహించే చోట జగనన్న ఇల్లు ఇచ్చి నిరుపేదలను ఆక్షేపించడమేనని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాకా ఒక్క అభివృద్ధి పని అమరావతిలో చేయలేదని చెప్పారు.

ఎంత సేపు రాజకీయాలు, కక్ష సాధింపులు ఈ వైసీపీ లక్ష్యం అని ఫైర్ అయ్యారు. అనకాపల్లి ప్రజానీకం చంద్రబాబుకు హారతులు పట్టారన్నారు. అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్ పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమని.. ఇప్పటికైనా మంత్రి అమర్నాథ్ విమర్శలుమాని తన శాఖలు మీద దృష్టి పెడితే మంచిది అని హితవు పలికారు.

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లోడగల కృష్ణ మాట్లాడుతూ.. మంత్రి అమర్నాథ్ తెలుసి తెలియని వాగుడు వాగుతున్నారు.. విశాఖ ఇంజినీరింగ్ కాలేజ్‌లో జరిగిన సభలో మహిళలకు లక్షల విలువైన భూమి టీడీపీ ఇచ్చింది.. వైసీపీ హయాంలో స్మశానాంలోనే ఇల్లు ఇచ్చారని అన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ రాజీనామా చెయ్యడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. తన పేరు మీద ఏ ఆస్తులు చూపినా రాజీనామా చేస్తానన్నారు.

Next Story

Most Viewed