CM జగన్‌పై పరిటాల సునీత సీరియస్

by GSrikanth |
CM జగన్‌పై పరిటాల సునీత సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకురాలు పరిటాల సునీత సీరియస్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాకు సీఎం జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. జిల్లా ఎమ్మెల్యేలు కూడా సీఎం జగన్ దగ్గర కూర్చొని ఒక్క రూపాయి నిధులు తీసుకురాలేక పోయారని ఎద్దేవా చేశారు. నిన్నటి వరకు వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న వైసీపీ ‘సిద్ధం’ సభలకు జనం స్వచ్చదంగా రాలేదని అన్నారు. బెదిరించి ప్రజలను సభలకు తీసుకొస్తున్నారని సెటైర్లు వేశారు. కేవలం చంద్రబాబును తిట్టడానికే సీఎం జగన్ రాప్తాడుకు వచ్చాడని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.



Next Story

Most Viewed