కుటుంబం ఆత్మహత్యాయత్నం... తల్లీకుమార్తె మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-29 10:12:43  IST  )

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు...

కుటుంబం ఆత్మహత్యాయత్నం... తల్లీకుమార్తె మృతి
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా(Palnadu) నరసరావుపేట(Narasaraopet)లో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తల్లి, మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. తల్లి శంకరకుమారి, ఆమె మూడేళ్ల కుమార్తె మౌనిక మృతి చెందగా, తండ్రి గోపి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అసలు ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారనే కోణంలో ఆరా తీస్తున్నారు.

Next Story