ఏజెన్సీలో బాక్సైట్ జోలికొస్తే ఊరుకోం: కూటమి నేతలకు పాడేరు ఎమ్మెల్యే వార్నింగ్

by Vemula.Srinu Prasad |

ఏజెన్సీలో బాక్సైట్ జోలికొస్తే ఊరుకోమని కూటమి నేతలకు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు హెచ్చరించారు....

ఏజెన్సీలో బాక్సైట్ జోలికొస్తే ఊరుకోం: కూటమి నేతలకు పాడేరు ఎమ్మెల్యే వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ(Agency)లో బాక్సైట్(Bauxite) జోలికొస్తే ఊరుకోమని కూటమి నేతలకు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు(Paderu MLA Visveswara Raju) హెచ్చరించారు. 2014-19 హయాంలోనూ అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) పాడేరు ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు యత్నించారని ఆయన ఆరోపించారు. అందుకే వైఎస్ జగన్ ప్రభుత్వం(Ys Jagan Government)లో జీవో నెం.97 రద్దు చేశామని చెప్పారు. ఇప్పుడు కొత్తగా అదే జీవో తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, సీఎం చంద్రబాబును గిరిజనులు నమ్మే పరిస్థితిలో లేరని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు వ్యాఖ్యానించారు.

Next Story