ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు జడ్జిలు.. రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-03 09:59:39  IST  )

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు కొత్తగా అదనపు న్యాయమూర్తులు నియామకమయ్యారు...

ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు జడ్జిలు.. రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(Andhra Pradesh High Court)కు ముగ్గురు కొత్తగా అదనపు న్యాయమూర్తులు(Additional Judges) నియామకమయ్యారు. న్యాయవాదులు సునీత గంధం, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్‌‌ విశేష సేవలందిస్తున్నారు. దీంతో వారిని హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా కేంద్రప్రభుత్వం నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్త నియామకాలపై ద్రౌపది ముర్ము ఆమోదముద్ర

అంతేకాదు వీరి నియామకంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ ప్రక్రియ పూర్తయింది. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను తొలుత కేంద్ర న్యాయశాఖ పరిశీలన చేసింది. ఆ తర్వాత రాష్ట్రపతి సైతం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో ఈ ముగ్గురు న్యాయమూర్తులు త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నియామకాల ద్వారా రాష్ట్ర ప్రజలకు న్యాయసేవలు మరింత సులభంకానున్నాయి.

Next Story