కాశీబుగ్గ తొక్కిసలాట.. నిర్మాణకర్త ఆశయం గొప్పదే.. కానీ : మంత్రి ఆనం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-02 07:07:06  IST  )

కాశీబుగ్గ దేవాలయంలో నిన్న తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం ఉదయం పరిశీలించారు.

కాశీబుగ్గ తొక్కిసలాట.. నిర్మాణకర్త ఆశయం గొప్పదే.. కానీ : మంత్రి ఆనం
X

దిశ, వెబ్‌డెస్క్: కాశీబుగ్గ దేవాలయంలో నిన్న తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం ఉదయం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు ఆలయమైనా దానిపై ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. తొక్కిసలాటలో 9 మంది మరణించగా.. పలాస పీహెచ్ సీలో 12 మంది, శ్రీకాకుళంలో ముగ్గురు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఆలయాన్ని నిర్మించిన హరిముకుంద్ పాండా సంకల్పం మంచిదే అయినా.. నిర్మాణం విషయంలో నిపుణుల సలహా తీసుకుని ఉంటే ఇలాంటి ప్రమాదం జరిగి ఉండకపోయేదన్నారు.

ఈ ప్రాంత ప్రజలు తిరుమలకు వెళ్లలేకపోయినా ఆ వేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులు అందాలన్న మంచి ఉద్దేశంతో ఆయన ఆలయాన్ని నిర్మించారని ఆ ఆలయాన్ని చూస్తే తెలుస్తోందన్నారు. ఆలయ నిర్మాణంలో ఇతర దాతలెవరూ లేరని, తన సొంత నిధులతోనే ఈ ఆలయాన్ని పట్టుదల, కృషితో నిర్మించారన్నారు. అలాంటి ఆలయంలో ఇలాంటి విషాద ఘటన జరగడం బాధాకరమన్నారు. కానీ ఆలయ నిర్మాణంలో చిన్న చిన్న లోపాలున్నాయని, వాటిని సరిచేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

Next Story