Nara Lokesh: నీ అబ‌ద్ధం తాత్కాలికం.. మా నిజం శాశ్వతం

by Anil Sikha |
Nara Lokesh: నీ అబ‌ద్ధం తాత్కాలికం.. మా నిజం శాశ్వతం
X

శుభానికి సంకేతంగా పసుపు రంగు మిషన్లు ఇచ్చాం..

మంత్రి నారా లోకేష్

దిశ, డైనమిక్ ​బ్యూరో : శుభానికి సంకేతంగా తాము తన పార్టీ పసుపు రంగు కుట్టు మిషన్లు మహిళలకు అందజేశామని మంత్రి నారా లోకేశ్​ పేర్కొన్నారు. ‘జ‌నం సొమ్ముతో పెట్టిన ప‌థ‌కాల‌కు నీలా పార్టీ రంగులు, నీ పేర్లు పెట్టుకోవాల‌నే యావ మాకు లేదు. నీ అబ‌ద్ధం తాత్కాలికం. మా నిజం శాశ్వతం..’ అంటూ ఒక ట్వీట్​చేశారు. జగన్ (Jagan)​అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రజలకు గాలికి వ‌దిలేసి, జ‌నం సొమ్ము దోచుకోవ‌డమే ప‌నిగా పెట్టుకున్నారని ఆర్పించారు. అప్పుడు తాను ఎమ్మెల్యేనీ కూడా కాదన్నారు. ప్రజల కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ నాయ‌కుడిగా, నా మంగ‌ళ‌గిరి (Mangalagiri)నియోజ‌క‌వ‌ర్గ ప్రజలకు స్వయం ఉపాధికి చేయూత‌నందించాల‌ని నిర్ణయించుకున్నానని తెలిపారు. మ‌హిళ‌లు, చేనేత‌లు, స్వ‌ర్ణ‌కారులు, చిరువ్యాపారుల‌కు అవ‌స‌ర‌మైన సామాగ్రి, ఆర్థిక సాయంతో చేయూత‌నందించానన్నారు. వీట‌న్నింటికీ నా సొంత నిధులు వెచ్చించాను. కుల‌,మ‌త అంత‌రాలు పాటించ‌కుండా...త‌మ కాళ్లపై తాము నిల‌బ‌డాల‌నుకునే మ‌హిళామ‌ణులు వేలాదిమందికి స్త్రీశ‌క్తి పేరుతో ఉచితంగా శిక్షణ ఇచ్చి, ట్రైనింగ్ పూపూర్తయ్యాక స‌ర్టిఫికెట్లు, ఉచితంగా టైల‌రింగ్ మిష‌న్‌, మెటీరియ‌ల్ అంద‌జేశానని తెలిపారు. ఇవ‌న్నీ తన జేబులోంచి తీసిన డ‌బ్బులు, తన ఖాతాల నుంచి వెచ్చించిన సొమ్ములు కాబ‌ట్టే...శుభానికి సంకేత‌మైన నా పార్టీ ప‌సుపు రంగు మిష‌న్లు ఇచ్చానని వివరించారు. జ‌నం సొమ్ముతో పెట్టిన ప‌థ‌కాల‌కు నీలా పార్టీ రంగులు, నీ పేర్లు పెట్టుకోవాల‌నే యావ మాకు లేదు. నీ అబ‌ద్ధం తాత్కాలికం. మా నిజం శాశ్వతం అంటూ ఆయన ట్విట్టర్​లో పేర్కొన్నారు.



Next Story

Most Viewed