"జై తెలుగు" పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ..

by Disha Web Desk 12 |
జై తెలుగు పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. ఈ సారి పాత రాజకీయ నాయకులు కాకుండా.. సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు కొత్త పార్టీని పెట్టనున్నారు. తెలుగు భాష పరిరక్షణ కోసం "జై తెలుగు" పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు జొన్నవిత్తుల ప్రకటించారు. ఆంధ్రరాష్ట్రంలో తెలుగు భాషకు పునర్వైభవం తీసుకురావాలన్నదే తన సంకల్పమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులను, ప్రజలను చైతన్యం చేయడానికే జై తెలుగు పార్టీ పెడుతున్నట్లు జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు తెలిపారు.



Next Story