తిరుమల రహదారులకు కొత్త పేర్లు.. 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టు

by Gantepaka Srikanth |

తిరుమల రహదారులకు కొత్త పేర్లు.. 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టు

తిరుమల రహదారులకు కొత్త పేర్లు.. 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపారు. భక్తుల సౌకర్యమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) తెలిపారు. సమావేశం అనంతరం చైర్మన్‌ బీఆర్‌ నాయుడు మీడియాతో మాట్లాడి తీసుకున్న నిర్ణయాలను వివరించారు.

తీసుకున్న నిర్ణయాలు :

= తిరుపతిలో 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్

= ముంబై బాంద్రాలో రూ.14.40 కోట్లతో శ్రీవారి ఆలయం

= ధ్వజస్తంభాలు, రథాల కోసం 100 ఎకరాల్లో దివ్య వృక్షాల పెంపకం

= టీటీడీ విద్యాసంస్థల్లో డిజిటల్ క్లాస్‌రూములు, సీసీ కెమెరాలు

= ఎస్వీ జూనియర్ కాలేజీల డేస్కాలర్లకు మధ్యాహ్న భోజన పథకం

= తిరుమల రహదారులకు శ్రీవారి నామాలతో పేర్లు

= అర్చకులు, పరిచారకులు, పోటు వర్కర్ల వేతనాల పెంపు

చివరగా భక్తులకు మెరుగైన సేవలు, సంస్థాగత బలోపేతమే మా లక్ష్యమని పేర్కొన్నారు.

Next Story