Big Breaking: తెలంగాణ కోడలిని నమ్మకండి.. ఎందుకంటే..?

by Disha Web Desk 3 |
Big Breaking: తెలంగాణ కోడలిని నమ్మకండి.. ఎందుకంటే..?
X

దిశ వెబ్ డెస్క్: ఒకప్పుడు రోజంతా చేసిన పనులను నిద్రకు ఉపక్రమించే ముందుగా డైరీ లో రాసుకుని ఆ డైరీ ఎవరు చూడకుండా దాచుకుని పడుకునేవాళ్ళం. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు కూడా మనలో చాలామంది వాళ్ళు రోజు చేసిన పనులను రాసుకుంటున్నారు.. కాని బుక్ లో కాదు, పేస్ బుక్, X ఇలాంటి సోషల్ మీడియా వేదికల్లో రాస్తున్నారు. ఇక వాటిని చూసిన నెటీజన్స్ నచ్చినట్లు స్పందిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న తాను చేసిన ఇచ్ఛాపురం పర్యటన గురించి అందులో తాను మాట్లాడిన విషయాల గురించి X వేదికగా చెప్పుకొచ్చారు.

తాను పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు APSRTC బస్సులో ప్రయాణికులతో మాట్లాడి వారి ప్రాంతంలో జరిగిన అభివృద్ధిపై చర్చించడం జరిగిందని.. అలానే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై వైవీ సుబ్బారెడ్డి గారి సవాల్‌ని స్వీకరిస్తున్నానని.. మీరు చేసిన అభివృద్ధి చూపించండి అంటూ.. మీ అభివృద్ధి చూడటానికి నేను సిద్ధం అని పేర్కొంటూ.. డేట్, టైం మీరు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే .. నాతో పాటు మేధావులు, ప్రతిపక్షాలు, మీడియా ప్రతినిధులను కూడా పిలుద్దాం అని.. మీరు అభివృద్ధి చేసింది ఎక్కడా..? మీరు చెప్పిన రాజధాని ఎక్కడా..? మీరు కట్టిన పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడా..? ఇలా మీ అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం అంతా చూడాలని అనుకుంటున్నాము..చూపించండి అంటూ x వేదికగా పోస్ట్ చేశారు.

కాగా ఈ పోస్ట్ చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు తెలంగాణాలో నిలబడతా అన్నావ్.. మమ్మల్ని నిలబెడతా అన్నావ్.. మరి మమల్ని నిలబెట్టావా..? అని కామెంట్ పెట్టగా.. మరొకరు.. ఈ తెలంగాణ కోడల్ని నమ్మకండి.. నమ్మితే నట్టేట ముంచుతుంది అని పెట్టారు. మరొకరు వేషం మార్చెను, భాష మార్చెను, ప్రాంతాలను మార్చెను, తానే మారెను ఇందుకోసం, ఎవరి కోసం, ఏమి ఆశించి ఇవి అన్నీ. సాధించాలంటే కుటిల ప్రత్యర్థులతో కలవడం అవసరమా..? ఆలోచించండి షర్మిల గారు అని కామెంట్ చేశారు. ఇలా వైఎస్ షర్మిల చేసిన పోస్ట్ పైన నెటీజన్స్ విమర్శల జల్లు కురిపిస్తున్నారు.


Next Story