AP Politics:‘అరేయ్ నా కొడకా నోరుమూసుకో..’

by Disha Web Desk 3 |
AP Politics:‘అరేయ్ నా కొడకా నోరుమూసుకో..’
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రానున్న ఎన్నికల నేపథ్యంలో వైసీపీకి, టీడీపీకి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటోంది. అటు బహిరంగ సభల్లోనూ ఇటు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శల జల్లు కురిపించుకుంటున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ (X) వేదికగా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఓ పోస్ట్ చేశారు.

జగన్ రెడ్డి "జె" టాక్స్ కోసం నాణ్యతలేని అడ్డగోలు మద్యం బ్రాండ్లు అమ్మిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు అని ఆ పోస్ట్ లో నారా లోకేష్ రాసుకొచ్చారు. కాగా ప్రస్తుతం నారా లోకేష్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ పలురకాలుగా స్పందిస్తున్నారు. లైసెన్సు రెన్యూవల్ ఇచ్చింది మీ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.. దొంగ వేషాలెయ్యకు పప్పుగా అని, అరేయ్ నా కొడకా నోరు మూసుకో అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.


Next Story

Most Viewed