నిజాంపట్నం తీరానికి కొట్టుకొచ్చిన భారీ ‘నావిగేషన్ బోయ్’

by Ramesh Naini |

బాపట్ల జిల్లా నిజాంపట్నం సముద్ర తీరానికి ఓ భారీ నావిగేషన్ బోయ్ కొట్టుకొచ్చింది.

నిజాంపట్నం తీరానికి కొట్టుకొచ్చిన భారీ ‘నావిగేషన్ బోయ్’
X

దిశ, డైనమిక్ బ్యూరో: బాపట్ల జిల్లా నిజాంపట్నం సముద్ర తీరానికి ఓ భారీ నావిగేషన్ బోయ్ (Navigation Buoy) కొట్టుకొచ్చింది. నీటిపై బెలూన్‌లా తేలియాడుతున్న ఈ పరికరాన్ని స్థానిక మత్స్యకారులు గుర్తించి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. చెన్నై పోర్టు వద్ద వాతావరణ సమాచారాన్ని సేకరించేందుకు ఏర్పాటు చేసిన ఈ పరికరం ప్రమాదవశాత్తు విడిపోయి అలల ఉధృతికి నిజాంపట్నం తీరానికి చేరుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. సుమారు రూ. 70 లక్షల విలువైన ఈ నావిగేషన్ బోయ్‌ను చెన్నై అధికారుల విజ్ఞప్తి మేరకు ఇక్కడి అధికారులు లారీలో తిరిగి అక్కడికి సురక్షితంగా పంపించారు.

Next Story