- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరదలో వైరాన్ని మర్చిన జీవులు.. వైరల్గా మారిన అరుదైన దృశ్యం
ఉత్తర భారతదేశంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రకృతి ఒక అద్భుతమైన జీవ సత్యాన్ని ఆవిష్కరించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తర భారతదేశంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రకృతి ఒక అద్భుతమైన జీవ సత్యాన్ని ఆవిష్కరించింది. విపత్కర పరిస్థితుల్లో మనుగడ కోసం చేసే పోరాటం ముందు వైరం ఏమాత్రం పనిచేయదని ఈ ఘటన నిరూపించింది.
ఒకే చోట చేరిన బద్ధశత్రువులు
వరద ముప్పు నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు పాములు, కొంగ, ఎలుకలు, తాబేలు తమ సహజ సిద్ధమైన వైరాన్ని మరిచి ఒకే చోట ఆశ్రయం పొందాయి. ప్రాణ భయంతో ఉన్న ఆ జీవులు ఒకరికొకరు ఎలాంటి హాని చేసుకోకుండా ప్రశాంతంగా ఒకే దగ్గర ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
నెట్టింట వైరల్
ఈ అరుదైన దృశ్యం గుజరాత్లో కన్పించినట్లుగా తెలుస్తోంది. కానీ కచ్చితమైన ప్రదేశం తెలియరాలేదు. అయితే, ఓ వ్యక్తి వివరణ ఇస్తూ తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కష్టకాలంలో ప్రకృతి అందరినీ ఒకే వరుసలో నిలబెడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.






