ఏపీ ఎస్ఆర్టీసీకి జాతీయ స్థాయి అవార్డు..

by Disha Web Desk 6 |
ఏపీ ఎస్ఆర్టీసీకి జాతీయ స్థాయి అవార్డు..
X

దిశ, డైనమిక్ బ్యూరో : జాతీయస్థాయిలో ఏపీఎస్ఆర్టీసీకి మరో అవార్డు లభించింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ నిర్వహించిన “డిజిటల్ టెక్నాలజీ” పోటీలలో ఎంటర్ ప్రైజ్ అప్లికేషన్ విభాగంలో డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డు దక్కించుకుంది.

ఈ అవార్డుతో వరుసగా 5వ సారి అవార్డు దక్కించుకున్న ఘనత ఏపీఎస్ఆర్టీసీకే దక్కుతుంది. ఈ అవార్డును కొచ్చిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఏ) కోటేశ్వరరావు, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్(ఐ.టి) శ్రీనివాస రావులు అందుకున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన డిజిటల్ చెల్లింపులకు గానూ అవార్డు దక్కింది. ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రశంసించింది.

Next Story

Most Viewed