బెంజ్ మంత్రి! మీ ఆవు కథలు ఆపండి: నారా లోకేశ్

by Disha Web Desk 6 |
బెంజ్ మంత్రి! మీ ఆవు కథలు ఆపండి: నారా లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రకార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరోసారి విరుచుకుపడ్డారు. మంత్రి అన్యాయంగా కొట్టేసిన భూములపై చేసిన సవాల్‌కు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. తాను అడిగిన దానికి తప్ప ప్రపంచంలో ఉన్న మిగిలిన అన్ని విషయాలు మాట్లాడుతూ నోరు పారేసుకోవడం ఎందుకు అని ప్రశ్నించారు. ఈఎస్ఐ స్కాం పై చర్చకు సిద్దం అంటున్నారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల లో స్కాం కి పాల్పడి మీరు బెంజ్ కారు గిఫ్ట్ గా తీసుకున్నారు అని ఆధారాలతో సహా ఎన్నో సార్లు బయటపెట్టాం. అదే కారులో మీ ముద్దుల కుమారుడు షికార్లు కొట్టడం రాష్ట్రం మొత్తం చూసింది అని లోకేశ్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏమి తెలియనట్లు ఈఎస్ఐ స్కాం పై చర్చకు సిద్దమా అంటూ సవాల్ చెయ్యడం హాస్యాస్పదంగా ఉంది అని లోకేశ్ అన్నారు. ప్రభుత్వం లో ఉంది మీరు అనే విషయాన్ని మర్చిపోయినట్టు ఉన్నారు.

మీకు దమ్ముంటే ఆధారాలు బయట పెట్టండి అని సవాల్ విసిరారు. ఇప్పటికైనా బెంజ్ మంత్రి మీ ఆవు కథలు ఆపండి. నేను నా సవాల్ కి కట్టుబడి ఉన్నా. ఎవరైనా ముందు కోస్తే భూములు రైతుల పేరిట రాయడానికి సిద్దం అని మీరే పబ్లిక్ గా ప్రకటించారు అని గుర్తు చేశారు. ఇప్పుడు వెనక్కి తగ్గి బూతులతో విరుచుకుపడుతున్నారు అని మండిపడ్డారు. ‘నేను మిమ్మలని స్ట్రయిట్ గా అడుగుతున్నా. ప్రభుత్వ ధర చెల్లించి ఆ భూములు రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడని సిద్దం. మీరు అక్రమంగా కొట్టేసిన భూములు వెనక్కి ఇవ్వడానికి సిద్దమా? అని సవాల్ విసిరారు. మీరు వందల ఎకరాలు అధిపతి అయ్యారు జిల్లా లో ఉన్న ఒక్క వాల్మీకి కుటుంబం అయినా ఒక్క ఎకరం భూమి కొనే స్థితిలో ఉన్నారా? మీరు బెంజ్ కారులో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. జిల్లాలో ఉన్న ఒక్క వాల్మీకి కుటుంబం అయినా చిన్న కారు కొనే పరిస్థితిలో ఉన్నారా? అధికారంలో ఉంది మీరు, ప్రతిపక్షంలో ఉంది మేము అని గుర్తించుకోండి అని లోకేశ్ హితవు పలికారు.

Next Story

Most Viewed