కడపకు రేణిగుంట ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు ఇవ్వండి: కేంద్ర‌మంత్రిని కోరిన ఎంపీ అవినాశ్ రెడ్డి

by Vemula.Srinu Prasad |

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కలిశారు...

కడపకు రేణిగుంట ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు ఇవ్వండి: కేంద్ర‌మంత్రిని కోరిన ఎంపీ అవినాశ్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌(Union Railway Minister Ashwani Vaishnav)ని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి(MP YS Avinash Reddy) కలిశారు. మైసూరు - రేణిగుంట వీక్లీ ఎక్స్‌ప్రెస్‌(Mysore - Renigunta Weekly Express)ను కడప(Kadapa) వరకూ పొడిగించాలని ఆయన కోరారు. మచిలీపట్నం–ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌(Machilipatnam-Dharmavaram Express)కు ముద్దనూరు(Muddanur)లో స్టాపింగ్ కల్పించాలని అశ్వినీ వైష్ణవ్‌‌కు అవినాశ్ రెడ్డి విన‌ప‌త్రం అంద‌జేశారు.

ఎన్నో రోజులుగా ప్రజల నుంచి ఈ రెండు రైళ్ల డిమాండ్ వినిపిస్తున్నాయి. కడప నుంచి డైరెక్ట్‌గా మైసూర్, మచిలీపట్నం వెళ్లేందుకు రైళ్లు లేవు. దీంతో ఈ రూట్‌లో కడప జిల్లా ప్రజలు ప్రయాణాలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కడప ఎంపీకి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని కడప వాసులకు ఎంపీ అవినాశ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి ప్రజల ప్రజల డిమాండ్లు, అవసరాలను ఎంపీ అశినాశ్ రెడ్డి వినతి పత్రంలో రూపంలో అందజేశారు. ఇందుకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ సైతం సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.

Next Story