సీఎం జగన్ పుట్టకముందే విశాఖ ఉంది: సమ్మిట్‌పై ఎంపీ RRR ఫైర్

by Disha Web Desk 19 |
సీఎం జగన్ పుట్టకముందే విశాఖ ఉంది: సమ్మిట్‌పై ఎంపీ RRR ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌పై నర్సాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నేత రఘురామరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అనేది వైసీపీ మాయా బజార్ అని విమర్శలు గుప్పించారు. ఏపీలో పెట్టుబడుల పేరుతో భూకబ్జాల ప్రయత్నం జరగుతోందని ఆరోపించారు. సమ్మిట్ పేరుతో ఈ స్థల యజ్ఞం ఏంటని ప్రశ్నించారు. కంపెనీలకు 7లక్షల ఎకరాల భూమి ఎలా ఇస్తారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. వైసీపీ నాలుగేళ్లలో చేసిందేమి లేకే ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. సీఎం జగన్ పుట్టకముందే విశాఖ ఉందని.. అక్కడ పరిశ్రమలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని సజావుగా పరిపాలించాలని జగన్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

Next Story

Most Viewed