టీడీపీ, జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో తేల్చేసిన ఎంపీ రఘురామ

by Disha Web Desk 1 |
టీడీపీ, జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో తేల్చేసిన ఎంపీ రఘురామ
X

దిశ, వెబ్‌డెస్క్ : సీఎం జగన‌కు ప్రభుత్వ సొమ్ము నొక్కేయడమేని తెలుసని, ఖర్చ చేయడం తెలియదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. నానుంచి జగన్ సాయం అర్థించాడే తప్పా.. తానకు జగన్ ఎప్పుడు సాయం చేయలేదని అన్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు జైలు ఉండగా, సాయం చేసిన వారే నిజమైన మిత్రులని వారే చంద్రబాబు, పవన్ కల్యాణ్ అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ముక్తకంఠంతో వ్యతిరేకించాను కాబట్టే జగన్ తనపై పగబట్టి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పష్టం చేశారు. దాదాపు 135 స్థానాల్లో ఆ పార్టీల అభ్యర్థులు అప్రతిహత విజయం సాధిస్తారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపడితే టీడీపీ-జనసేన కూటమి మరో 20 స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు.

Next Story

Most Viewed