కూతురికి అట్లకాడతో వాతలు.. తల్లి కర్కసత్వం

by Anil Sikha |
కూతురికి అట్లకాడతో వాతలు..  తల్లి కర్కసత్వం
X

దిశ, డైనమిక్ బ్యూరో/ పల్నాడు చట్టాలు ఎన్ని వచ్చినా చిన్నారులకు రక్షణ కరువు అవుతుంది. మనిషిలోని కర్కసత్వం.. పసివాళ్లను వేధిస్తోంది. విచక్షణ కోల్పోయిన వారు పెట్టే చిత్రహింసలకు ఆ పసి హృదయాలు తల్లడిల్లుతున్నాయి... వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని కన్న బిడ్డపైనే కర్కశత్వం చూపిన ఓ తల్లి అమానుష ఘటన బయటపడింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి రైల్వే స్టేషన్ దగ్గర నివాసం ఉంటున్న మాధవికి నాలుగేళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఆమెకు ఆరేళ్ల కుమార్తె ఉంది. శివ పార్వతి అనే మహిళ ఇంట్లో అద్దెకు ఉంటుంది. ఈ నేపథ్యంలో మాధవి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కోనసాగిస్తుండగా ఆమెకు శివపార్వతి సహకరిస్తుంది. వివాహేతర సంబంధానికి బిడ్డ అడ్డు వస్తుందని భావించిన మాధవి శివ పార్వతి ఇద్దరు బాలికను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఐదు రోజులుగా అన్నం పెట్టకుండా అట్లకాడతో తల్లి మాధవి బాలిక శరీరం పై వాతలు పెట్టింది. అన్నం లేక కాలిన గాయాలతో ఉన్న బాలిక ఆకలిని తట్టుకోలేక పక్కింటి వారు పడేసిన అన్న ఎరుకలోని తింటుంది. ఈ దృశ్యాన్ని చూసిన ఓ న్యాయ విద్యార్థి చలించిపోయాడు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న పాపను గమనించి 1098కి ఫిర్యాదు చేశాడు. దీనితో తల్లి మాధవి, ఆమెకు సహకరించిన శివపార్వతి అనే మహిళను పోలీసులు స్టేషన్ కు తరలించారు. బాలికను నరసరావుపేటలోని శిశు సంక్షేమ గృహనికి ఐసిడిఎస్ అధికారులు తరలించారు.

చట్టాలు పటిష్టంగా మారాలి..

చిన్నారుల రక్షణకు ప్రత్యేక చట్టాలు చేస్తున్నాయి. అయితే అవి అమలకు నోచుకోవటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్నారులపై దాడులు జరిగితే నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కు ఫిర్యాదు చేయవచ్చు. ఇటువంటి సేవలపై ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది.



Next Story

Most Viewed