- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్సీ వర్సెస్ మండలి చైర్మన్.. డివిజన్ బెంచ్కు పంచాయితీ
ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ రాజీనామా పంచాయితీ డివిజన్ బెంచ్కు చేరింది..

X
దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ(MLC Jayamangala Venkataramana) రాజీనామా వ్యవహారం మండలి చైర్మన్ పరిధిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే చాలా రోజులుగా రాజీనామాను పెండింగ్లో ఉంచడంతో జయమంగళ వెంకట రమణ హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్.. జయమంగళ వెంకట రమణ రాజీనామాపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దీంతో డివిజన్ బెంచ్ను మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేశారు. ఈ మేరకు తదుపరి విచారణను డివిజన్ బెంచ్ ఈ నెల 18కి వాయిదా వేసింది. కాగా వైసీపీ(Ycp) నుంచి జనసేన(Janasena)లో చేరిన జయమంగళ వెంకట రమణ తన రాజీనామాను ఆమోదించాలని కోరుతున్నారు. అయితే మండలి చైర్మన్ మోషేను రాజు స్పందించకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు.
Next Story






