Balakrishna: వరుపుల రాజా మృతి అత్యంత బాధకరం

by Disha Web Desk 16 |
Balakrishna: వరుపుల రాజా మృతి అత్యంత బాధకరం
X

దిశ,డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా మృతిపట్ల హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. యువకుడు అయిన రాజా గుండెపోటుకు గురై మృతి చెందడం అత్యంత బాధకరమన్నారు. వరపుల రాజా నిరంతరం ప్రజా సమస్యలపై స్పందిస్తూ.. పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని కొనియాడారు. విలువలకు, నిబద్ధ రాజకీయాలకు కట్టుబడ్డ అరుదైన వ్యక్తిత్వం వరుపుల రాజాది అని చెప్పారు. స్నేహంలో అప్యాయత, సేవల్లో వినమ్రతతో అందరిని ఆకట్టుకునేవారని, రాజా మృతి టీడీపీకి తీరని లోటు అని బాలకృష్ణ పేర్కొన్నారు.

Next Story

Most Viewed