చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   (  Updated:2024-01-09 07:35:52  IST  )

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ నాన్ లోకల్ పొలిటీషియన్స్ అన్నారు. ఈ ఇద్దరు నేతలకు ఏపీలో సొంత ఇల్లు, ఓటు హక్కు లేదన్నారు. చంద్రబాబు, పవన్ ఫ్యామిలీలు ఏపీలో లేవన్నారు. హైదరాబాద్ నుంచి చట్టపు చూపుగా వచ్చిపోతున్నారన్నారు. చంద్రబాబు, పవన్‌కు మంచి చేయాలన్న ఆలోచన లేదన్నారు. ఇక, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పాలిటిక్స్ హీటెక్కాయి. వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన వార్ రోజురోజుకు ముదురుతోంది. తాజాగా చంద్రబాబు, పవన్ మంగళవారం సీఈసీ రాజీవ్ కుమార్ ను కలిసి రాష్ట్రంలో ఓటరు జాబితాలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు.

Next Story