- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మీ సేవలకు సలాం’.. రేషన్ డీలర్ను ప్రశంసించిన మంత్రి
రాష్ట్రంలో ఎన్డియే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోన్న విషయం తెలిసిందే.

దిశ,వెబ్డెస్క్: రాష్ట్రంలో ఎన్డియే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా పలు హామీలను అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలను కూడా తీసుకొచ్చింది. ఈ తరుణంలో ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేసేవారు. కానీ.. కూటమి ప్రభుత్వం ఇంటింటికి రేషన్ సరఫరాను రద్దు చేసి రేషన్ షాపులలో డీలర్ల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తోంది.
రేషన్ కార్డులున్న 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల సరుకులను మాత్రమే ప్రభుత్వం డోర్ డెలివరీ చేస్తోంది. ఈ తరుణంలో తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలో వర్షాన్ని లెక్కచేయకుండా కొండలు, గుట్టలు ఎక్కి తన బాధ్యతను నిర్వర్తించిన ఓ రేషన్ డీలర్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశంసించారు. ‘‘అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ గిరిజన ప్రాంతంలో అంకితభావంతో పనిచేస్తున్న మా డీలర్ సుందర్ రావుకు ధన్యవాదాలు. మిగతా 29,750 మంది డీలర్లు అధికారులకు థాంక్స్’’ అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.






