నేను సోనియా గాంధీ కాళ్లకే మొక్కలేదు.. రాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
నేను సోనియా గాంధీ కాళ్లకే మొక్కలేదు.. రాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కీలక నేత కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను కాళ్లు పట్టుకున్నానని కిరణ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. నేను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఏనాడూ సోనియా గాంధీ కాళ్లకే మొక్కలేదు అని కీలక వ్యాఖ్యలు చేశారు. చిదంబరం కాళ్లు పట్టుకొని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో కాంగ్రెస్‌ను కిరణ్ కుమార్ రెడ్డే సర్వనాశనం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read More..

Ap News: నామినేషన్లు దాఖలు చేసిన చంద్రబాబు, పురంధేశ్వరి


కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రిగా పనిచేసి బీజేపీ నుంచి పోటీ చేయడం సిగ్గుచేటు అని విమర్శలు గుప్పించారు. కాగా, మొన్న కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పెద్దిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవుల కోసం తాను ఎవరి కాళ్లూ పట్టుకోలేదని, పదవుల కోసం ఆత్మగౌరవం చంపుకోవాల్సిన అవసరం తనకు లేదని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గతంలో డీసీసీ అధ్యక్ష పదవి కోసం గెస్ట్ హౌస్‌కు వచ్చి పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎక్కడైనా ప్రమాణం చేస్తానని సవాల్ విసిరారు. తద్వారా పెద్దిరెడ్డికే ఆత్మగౌరవం లేదని కిరణ్ గుర్తుచేశారు. తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ పెద్దిరెడ్డి పై వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed