- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధవళేశ్వరంలో ప్రభుత్వ పత్రాలు దగ్ధం.. వాళ్లేనని మంత్రి నిమ్మల హాట్ కామెంట్స్
by Vemula.Srinu Prasad |
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంలో పత్రాలు దగ్ధం ఘటనపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు...

X
దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంలో పత్రాలు దగ్ధమైన విషయం తెలిసిందే. ఆ పత్రాలు పోలవరం ప్రాజెక్టు ప్రధాన కుడి కాలువ భూ సేకరణకు సంబంధించినవిగా అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పత్రాల దగ్ధంపై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పత్రాలను వైసీపీ వాళ్లే తగలబెట్టారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే ఫైళ్లు దగ్ధం చేస్తున్నారని, ఎవరికి కనిపించకుండా మాయం చేస్తున్నారని మండిపడ్డారు. నిందితులను అసలు వదిలిపెట్టమని మంత్రి నిమ్మల హెచ్చరించారు.
Next Story






