మంగళగిరి ప్రజలకు గుడ్ న్యూస్.. ఉచిత బస్సు సేవలు ప్రారంభం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-10 12:45:10  IST  )

మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలు ప్రారంమయ్యాయి...

మంగళగిరి ప్రజలకు గుడ్ న్యూస్.. ఉచిత బస్సు సేవలు ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. సుదూర ప్రాంతాల నుంచి ఎయిమ్స్ హాస్పటల్, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చి సరైన బస్సు సౌకర్యం లేక ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం మంత్రి నారా లోకేశ్ దృష్టికి స్థానిక నాయకులు తీసుకెళ్లారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించారు. ఇంజనీరింగ్ సంస్థ సిఎస్ఆర్ నిధుల నుంచి రూ.2.4 కోట్ల విలువైన రెండు Olectra ఎలక్ట్రికల్ బస్సులను ఉచితంగా అందించారు.

ఈ బస్సులను మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి నివాసంలో సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డిజిపి ఆఫీసు మీదుగా ఎయిమ్స్ వరకూ.. మరొకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాలస్వామి గుడి వరకు నడుస్తుందని తెలిపారు. ప్రయాణికులకు ఈ బస్సులు ఉచితంగా సేవలు అందిస్తాయని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

Next Story