Nara Lokesh : రాజ్యసభకు అమరావతి బిల్లు.. ఢిల్లీకి మంత్రి లోకేశ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-01 12:51:15  IST  )

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరగనున్న నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు...

Nara Lokesh : రాజ్యసభకు అమరావతి బిల్లు.. ఢిల్లీకి మంత్రి లోకేశ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధానిగా అమరావతి(Amaravati)కి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లుపై పార్లమెంట్‌(Parliament)లో చర్చ జరగనున్న నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) గురువారం ఢిల్లీ(Delhi) వెళ్లనున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం(Central Government) ప్రవేశపెట్టనున్న ఈ బిల్లుపై రాజ్యసభలో జరిగే చర్చా కార్యక్రమాలకు ఆయన హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ బిల్లు ఆమోదం పొందడంతో మంత్రి లోకేశ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

అమరావతిపై ఏకగ్రీవ తీర్మానం

ఇప్పటికే ఏపీ అసెంబ్లీలో అమరావతిపై ఏకగ్రీవ తీర్మానం చేసిన ప్రభుత్వం.. దానిని కేంద్రానికి పంపింది. ఈ క్రమంలో కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన అనంతరం పార్లమెంట్‌లో ఈ సవరణ బిల్లుపై చర్చ జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పర్యవేక్షించేందుకు, వివిధ పార్టీల మద్దతు కోరేందుకు లోకేశ్ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు, కీలక నేతలతో భేటీ అయ్యే అవకాశం సైతం ఉంది. అమరావతి భవిష్యత్తుకు చట్టపరమైన భద్రత కల్పించడమే లక్ష్యంగా మంత్రి లోకేశ్ పర్యటన కొనసాగనుంది.

Next Story