Kotam Reddy : కోటంరెడ్డికి మంత్రి కాకాని స్ట్రాంగ్ కౌంటర్!

by Disha Web Desk 4 |
Kotam Reddy : కోటంరెడ్డికి మంత్రి కాకాని స్ట్రాంగ్ కౌంటర్!
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఏపీ మంత్రి కాకాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కోటం రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని మ్యాన్ ట్యాపింగ్ మాత్రం జరిగిందన్నారు. కోర్టులో కేసు వేస్తానన్నావ్.. కేంద్రానికి ఫిర్యాదు చేస్తానన్నావ్ ఏమైందని ప్రశ్నించారు. టీడీపీ అభ్యర్థిగా ఖరారై వచ్చాకే శ్రీధర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 2014లో మనమంతా ఎవరమని.. జగన్ పుణ్యం కారణంగానే మనమంతా గెలిచామన్నారు. నిన్నటి దాకా జగన్ కు విధేయుడిగా ఉన్న నువ్వు ఇప్పుడు మరొకరికి విధేయుడిగా మారిపోయావ్ అన్నారు.

కోటంరెడ్డిని అరెస్ట్, ఎన్ కౌంటర్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. జగన్‌కు కోటంరెడ్డిపై అనుమానం ఉంటే బాధ్యతలు అప్పగించే వారా అని ప్రశ్నించారు. వైసీపీని చంద్రబాబు భూస్థాపితం చేస్తామన్నారని అయినా జగన్ ఎక్కడా భయపడలేదన్నారు. శ్రీధర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆత్మహత్యాసదృశం అన్నారు. చంద్రబాబు కోటం రెడ్డిని వాడుకుంటున్నాడని ఫైర్ అయ్యారు.



Next Story

Most Viewed