దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి గుమ్మనూరు జయరాం

by Disha Web Desk 21 |
దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి గుమ్మనూరు జయరాం
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాతక కనకదుర్గమ్మను రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం దర్శించుకున్నారు. గురువారం ఉదయం అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేయగా ఆలయ కార్యనిర్వాహణాధికారి కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం దగ్గరుండి అమ్మవారి దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో గుమ్మనూరు జయరాం ప్రత్యేక పూజలు నిర్వహించి మెుక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వాహణాధికారి అమ్మవారి శేషవస్త్రం ప్రసాదాలు అందజేశారు.

Next Story

Most Viewed