Minister Durgesh:అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.. ఉపాధ్యాయులకు మంత్రి కీలక సూచనలు

by Jakkula.Mamatha |

నేడు(ఫిబ్రవరి 21) అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం(International Mother Language Day) సందర్భంగా ఏపీ(Andhra Pradesh) పర్యాటక శాఖ(Tourism Department) మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Minister Durgesh:అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.. ఉపాధ్యాయులకు మంత్రి కీలక సూచనలు
X

దిశ,వెబ్‌డెస్క్: నేడు(ఫిబ్రవరి 21) అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం(International Mother Language Day) సందర్భంగా ఏపీ(Andhra Pradesh) పర్యాటక శాఖ(Tourism Department) మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాష కోసం కృషి చేసిన గొప్ప సాహితీవేత్తల శ్రమను నేటి తరానికి తెలిపే బాధ్యతను తీసుకోవాలని మంత్రి కందుల ఉపాధ్యాయులను కోరారు.

ఇవాళ(శుక్రవారం) నిడదవోలు పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు మంత్రి వెళ్లారు. ఈ క్రమంలో తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు. శ్రీకృష్ణదేవరాయలుతో సహా తెలుగు భాష గొప్పతనాన్ని విశ్వవినువీధుల్లో విహరింపజేసిన అనేక మంది మహానుభావులను మంత్రి దుర్గేష్ స్మరించుకున్నారు. ఈ క్రమంలో వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ మాతృభాషపై విద్యార్థుల్లో అనురక్తిని పెంపొందించేందుకు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఆంగ్లంతో పాటు మాతృభాష అవసరాన్ని విద్యార్థులకు తెలియజేయాలని మంత్రి సూచించారు. తమిళనాడు తరహాలో తెలుగువారు సైతం మాతృభాష కోసం దోహదపడాలన్నారు. మాతృభాష పరిరక్షణ కోసం , తెలుగు భాష వ్యాప్తికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలుగు భాషా సాంస్కృతిక వికాసం కోసం సహకరించేందుకు సాంస్కృతిక శాఖ మంత్రిగా తానున్నానని పేర్కొన్నారు. తెలుగు భాష అంతరిస్తే తెలుగు జాతి అంతరిస్తుందని తెలుపుతూ మాతృభాష అభివృద్ధికి, ఔన్నత్యానికి పాటుపడాలన్నారు.

Next Story