- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్ది పవిత్ర వాహనం కాదు.. అది ఓ ‘పంది’..!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.

దిశ, వెబ్డెస్క్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీల మధ్య పోరు షురూ అయింది. ఒక పార్టీ మీద మరో పార్టీ శ్రేణులు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై, ఆయన ప్రచార వాహనం వారాహిపై సంచలన కామెంట్స్ చేశారు. అంబటి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ కాపులను వాడుకుని వదిలేస్తారని ఆరోపించారు. ఆయన ప్రయాణిస్తున్న వారాహి పవిత్రమైన వాహనం కాదని.. ఒక పంది అని అభివర్ణించారు. పంది వాహనంపై ఎక్కి బురదజల్లే కార్యక్రమం పవన్ చేస్తున్నారని విమర్శించారు. బురదజల్లే వాటిని ప్రజలు ఏం చేస్తారో మిమ్మల్ని కూడా అదే చేస్తారు. ప్రజలు ఆయనకు సరైన గుణపాఠం చెబుతారంటూ పవన్ కల్యాణ్ను అంబటి హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి : నా అభిమానులు నన్ను కూడా తిడుతున్నారు.. ఫ్యాన్స్పై పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్






