ఎంపీ విజయసాయిరెడ్డి కనుసన్నుల్లోనే మైన్స్ కుంభకోణం: మాజీ మంత్రి సోమిరెడ్డి

by Disha Web Desk 21 |
ఎంపీ విజయసాయిరెడ్డి కనుసన్నుల్లోనే మైన్స్ కుంభకోణం: మాజీ మంత్రి సోమిరెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌ జరుగుతోందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ అక్రమ మైనింగ్ అంతా వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి కనుసన్నుల్లోనే జరుగుతుందన్నారు. ఈ అక్రమ మైనింగ్‌కు సంబంధించిన ఆధారాలను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీడియాకు విడుదల చేశారు. దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఓబుళాపురం మైనింగ్‌, మధు కోడా బొగ్గు మైనింగ్‌ అతిపెద్ద స్కామ్‌లని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న సిలికా, క్వాడ్జ్‌ స్కామ్‌లు ఏపీలో జరుగుతున్నాయని ఆరోపించారు.‘నెల్లూరు జిల్లా పోరాటాలకు పుట్టినిల్లు. ఇప్పుడు భారీ స్కామ్‌లకు పుట్టినిల్లుగా జగన్‌ మార్చేశారు’ అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ‘నెల్లూరు జిల్లాలో మైన్స్‌ కుంభకోణంపై ఎన్నో పోరాటాలు చేశాం..డీజీపీకి ఫిర్యాదు చేశాం. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం హయాంలో ఒక్క టన్నుకి రూ.100 ఉన్న పన్ను ఇప్పుడు వైసీపీ హయాంలో రూ.381కి పెంచేశారు అని మండిపడ్డారు. వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలోనే ఈ మైన్స్‌ కుంభకోణం జరుగుతోంది అని చెప్పుకొచ్చారు. ప్రతి నెలా ఒకటో తేదీకి జగన్‌కు ఆ కమీషన్‌ను చేరుస్తున్నారని చెప్పుకొచ్చారు. మొత్తం రూ.4,455 కోట్ల విలువైన ఖనిజ సంపద దోపిడీకి గురైందని ఆరోపించారు. త్వరలో కేంద్ర విజిలెన్స్‌ అధికారులకు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తాం అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి ఊరు పక్కన దోపిడీ జరుగుతున్నా ఆయన పట్టించుకోవడం లేదని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed