బీజేపీలో జనసేన విలీనం : డీల్‌ ఎంతో లీక్ చేసిన KA Paul

by Disha Web Desk 21 |
బీజేపీలో జనసేన విలీనం : డీల్‌ ఎంతో లీక్ చేసిన KA Paul
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోసారి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి మార్గంలోనే పవన్ కల్యాణ్ పయనిస్తారని తాను నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీ‌లో ఎలా అయితే విలీనం చేశారో అలాగే పవన్ కల్యాణ్ కూడా జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసేస్తారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.5వేల కోట్లు, ఓ మంత్రి పదవికి డీల్ కుదిరిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీల మనిషి అని ఆరోపించారు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ప్యాకేజీ స్టార్లు కావాలా? రియల్ హీరోలు కావాలా? సినీ హీరోలు కావాలా? వరల్డ్ హీరోలు కావాలా? అని కేఏ పాల్ ప్రజలను ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడును దళితులు అసలు నమ్మవద్దని సూచించారు. మాల మాదిగలను విడదీసి అధికార పీఠమెక్కారని కేఏపాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed