చామరాజునగర్ ఎక్స్‌ప్రె‌స్‌లో భారీ దోపిడీ.. ప్రయాణికులను బెదిరించి లూటీ

by Vemula.Srinu Prasad |

చామరాజునగర్ ఎక్స్‌ప్రె‌స్‌లో భారీ దోపిడీ జరిగింది..

చామరాజునగర్ ఎక్స్‌ప్రె‌స్‌లో భారీ దోపిడీ.. ప్రయాణికులను బెదిరించి లూటీ
X

దిశ, వెస్ డెస్క్: ఇటీవల కాలంలో దొంగలు రైలు ప్రయాణికులను టార్గెట్ చేశారు. సడెన్‌లో రైలు(Train)లోకి ఎంట్రీ ఇచ్చి వారి దగ్గరనున్న సొమ్ములు ఎత్తుకెళ్తున్నారు. ఈ మధ్యనే సికింద్రాబాద్(Secunderabad) నుంచి వెళ్తున్న తిరుపతి(Tirupati) పద్మావతి రైలులో ప్రయాణికులను బెదిరించి భారీగా సొమ్ములు లూటీ చేశారు. ఈ ఘటన మర్చిపోకముందే మరో ఘటన కలకలం రేపింది. చిత్తూరు జిల్లా దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. చామరాజునగర్ ఎక్స్‌ప్రైస్‌(Chamarajunagar Express)లో ప్రయాణికులను బెదిరించి రూ. 10 లక్షలు లూటీ చేశారు. చిత్తూరు-సిద్ధపల్లి రైల్వే స్టేషన్ల(Chittoor-Siddhapalli railway stations) మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. కేసు నమోదు చేసి రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story